తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా?: కిషన్‌రెడ్డి

-

రాష్ట్రంలో కుటుంబపాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నేడు తెలంగాణ.. ఓ కుటుంబానికి బానిసగా మారే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దొరికిన అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారని.. తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? అని ప్రశ్నించారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఫామ్‌హౌస్‌లు పెరుగుతున్నాయే తప్ప డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇవ్వట్లేదని మండిపడ్డారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగించామని.. మనసా, వాచా, కర్మణా సకల జనులు పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

‘‘ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నమస్సులు.  ఒక్కరిద్దరి వల్లే తెలంగాణ రాలేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చేందుకు కృషి చేసిన దివంగత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ సందర్భంగా నివాళులర్పిద్దాం. చిన్న రాష్ట్రాల వల్లే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయనేది బీజేపీ ఉద్దేశం.” అని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version