తెలంగాణాలో తగ్గిన కరోనా కేసులు.. అందుకే !

-

గత కొద్ది రోజులుగా మూడు వేలకి దగ్గరదగ్గరగా నమోదవుతున్న తెలంగాణా కరోనా కేసులు ఇప్పుడు తక్కువగా నమోదయ్యాయి. రోజూ అరవై వేలకి పైగా టెస్ట్ లు చేస్తుండగా నిన్న మాత్రం అందులో సగమే చేశారు. అందుకే కరోనా కేసులు నమోదు కూడా గట్టిగానే తగ్గింది. తాజాగా ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 1,802 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,42,771కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 9 మంది కరోనా వలన చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 895కు చేరింది.

coronavirus
coronavirus

ఇప్పటిదాకా కరోనా నుండి 1,10,241 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 2,711 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 31,635 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 24,596 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 36,593 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 17,66,982కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 245 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 158 కేసులతో నిలిచింది

Read more RELATED
Recommended to you

Latest news