కర్ణాటకలో మొదటి కరోనా రీ ఇన్ఫెక్షన్ కేసు గుర్తింపు

-

కర్ణాటకలో మొదటి కరోనా రీ ఇన్ఫెక్షన్ కేసు గుర్తించారు. బెంగళూరుకు చెందిన ఒక మహిళకి రెండో సారి కరోనా సోకింది. 27 ఏడేళ్ళ సదరు మహిళకి రెండో సారి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. గత జూలై నెలలో ఆమెకు పాజిటివ్ అని తేలడంతో చికిత్స తీసుకుంది. దీంతో కొన్ని రోజులకి ఆమె కరోనా నెగటివ్ వచ్చింది. మళ్ళీ నెల రోజుల తరువాత లక్షణాలు కనిపించడంతో మరో సారి టెస్ట్ చేయించింది.

ఆ టెస్ట్ లో ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇప్పటికే ఈ రీ ఇన్ఫెక్షన్ కేసులు తెలంగాణాలో రెండు నమోదు అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఒకటి నమోదు అయింది. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతా విధుల్లో ఉన్న ఆఫీసర్ కి సోకడంతో కొంత టెన్షన్ నెలకొంది. అయితే ఇప్పుడు కర్ణాటకలో కూడా ఈ కేసు బయట పడడం ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news