ఆత్మ పిలుస్తోందంటూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు..!

-

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సాదారణంగా మనుషులు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు చెప్పండి. ఆర్థిక ఇబ్బందులు లేదా ప్రేమ విఫలం లేదా ప్రియురాలు మోసం.. ప్రియుడు మోసం.. చదువు రాకపోవడం.. ఫెయిల్ అవ్వడం.. జాబ్ రాకపోవడం.. భార్య వేధింపులు.. భర్త వేధింపులు.. ఏదైనా.. రకరకాల కారణాలతో మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు. అందులో వింతేమీ లేదు. కానీ.. ఈ యువకుడు మాత్రం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో చెబితే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నది ఓ అత్మ అతడిని పిలుస్తున్నదని.

ఓ నెల క్రితం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. ఆ ప్రమాదాన్ని ఇంజినీరింగ్ చదివే 18 ఏళ్ల సౌరభ్ ప్రత్యక్షంగా చూశాడు. అప్పటి నుంచి అదోలా ఉంటున్నాడు సౌరభ్. మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. సడెన్ గా ఓరోజు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ చదివి అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాలుడి ఆత్మ తనను పిలుస్తోందని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version