ఉదయం లేవగానే కోయిల గీతాల చిలిపి శబ్దాలు, చల్లని గాలికి తలుపు తట్టి మరీ వచ్చే సూర్యకిరణాలు ఈ రోజుల్లో కనపడటం లేదు. వాటి స్థానంలో మోగే అలారం, ఆ వెంటనే చేతిలోకి వచ్చే స్మార్ట్ఫోన్ కనిపిస్తోంది. పెద్దలకే కాదు, చిన్న పిల్లలకు కూడా ఈ అలవాటు సాధారణమైపోయింది. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూసే పిల్లల సంఖ్య పెరిగిపోయింది. ఈ అలవాటు వారి భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం ..
మానసిక సమస్యలు: ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల పిల్లల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది ఆందోళన, ఒత్తిడి, మరియు నిరాశకు దారితీస్తుంది.
కంటి చూపుపై ప్రభావం: ఫోన్లోని బ్లూ లైట్ పిల్లల కంటి చూపుపై చెడు ప్రభావం చూపుతుంది. దీని వల్ల కళ్ళు పొడిబారడం, కంటి నొప్పులు లాంటి సమస్యలు వస్తాయి.
నిద్రలేమి: ఉదయం లేవగానే స్క్రీన్ చూడటం వల్ల పిల్లల నిద్ర చక్రం దెబ్బతింటుంది. ఇది రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడానికి కారణం అవుతుంది.

సామాజిక నైపుణ్యాలు తగ్గిపోవడం: ఫోన్ వాడకం వల్ల పిల్లలు బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోలేరు. ఇతరులతో ఎలా మాట్లాడాలో, ఎలా కలిసి ఉండాలో వారికి తెలియదు.
శారీరక సమస్యలు: ఫోన్ చూస్తూ గంటల తరబడి కూర్చోవడం వల్ల స్థూలకాయం, మెడ నొప్పి లాంటి సమస్యలు వస్తాయి.
తల్లిదండ్రులకు సూచనలు: పిల్లలకు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ ఇవ్వడం మానేయాలి. వారికి ఆటలు ఆడే అవకాశం ఇవ్వాలి. పుస్తకాలు చదవడం లాంటి అలవాట్లు నేర్పాలి. మీరు కూడా ఉదయం ఫోన్ని దూరంగా ఉంచి వారికి ఆదర్శంగా నిలవాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి.
గమనిక :పైన చెప్పిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పిల్లల ప్రవర్తనలో ఏమైనా తీవ్రమైన మార్పులు గమనిస్తే, మీరు ఒక నిపుణుడి సలహా తీసుకోవాలి.