వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా? అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే..?

-

వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన డయేరియా, కలరా వంటి ప్రమాదకరమైన వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అటువంటి వ్యాధుల నుండి సురక్షితంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఎప్పుడైతే కలుషితమైన ఆహారం లేదా నీరును తీసుకుంటారో, ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక వర్షాకాలంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా బయట నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కనీసం 20 సెకండ్లు పాటు సబ్బుతో చేతులను కడుక్కోవాలి. అంతేకాకుండా, ఆహారాన్ని తీసుకునే ముందు తప్పకుండా చేతులను కడుక్కోవాలి. ఇలా చేయడం వలన క్రిములు చనిపోతాయి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ముఖ్యంగా వర్షాకాలంలో డయేరియాకు సంబంధించిన క్రిములు ఎక్కువగా వ్యాపిస్తాయి. కనుక అటువంటి వాటి నుండి దూరంగా ఉండాలంటే చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా వీలైనంతవరకు ఇంట్లో మాత్రమే మంచినీటిని తాగాలి. బయట ప్రదేశాలలో లేక రెస్టారెంట్ల లో మంచి నీటిని తాగడం వలన అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా డయేరియా లేదా కలరాకు సంబంధించిన క్రిములు కలుషితమైన నీరులో ఉంటాయి. వాటివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక ఆర్వో లేదా వాటర్ ప్యూరిఫైయర్ నుండి మాత్రమే నీటినే తాగాలి. లేకపోతే మంచినీటిని మరిగించి, మూత పెట్టి నిల్వ చేసుకొని ఆ నీటినే తాగాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఆహారాన్ని తీసుకునే విషయంలో కూడా ఎంతో జాగ్రత్త వహించాలి. నిల్వ చేసిన ఆహారాన్ని అసలు తీసుకోకూడదు లేదా తినడానికి ముందు మళ్లీ వేడి చేసుకొని తీసుకోవాలి. బయట ఉంచిన ఆహారాన్ని లేక చల్లగా ఉండే ఆహారాన్ని అసలు తీసుకోకూడదు. అంతేకాకుండా పండ్లు లేదా కూరగాయలను తప్పకుండా శుభ్రమైన నీటితో కడగాలి. కోసిన పండ్లను ఎక్కువ సేపు బయట ఉంచి తినడం వలన అనారోగ్యాన్ని ఎదుర్కొంటారు. కనుక తాజాగా ఉండే పండ్లు, కూరగాయలను శుభ్రం చేసుకొని మాత్రమే తీసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news