చాలా శాతం మంది ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అనవసరంగా ఎక్కువ సమయాన్ని ఆలోచనకు కేటాయించడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒకే విధంగా ఉండదు. కొంతమంది వెంటనే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు, కాకపోతే మరికొందరు అన్నిటిని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా ఓవర్ థింకింగ్ చేయడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తారో, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి.
ముఖ్యంగా భవిష్యత్తు కోసం లేక గతం కోసం ఆలోచించడం వలన ఆందోళనకు సంబంధించిన మానసిక సమస్యలు ఎదురవుతాయి అని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే ఇదే కొనసాగుతుందో, డిప్రెషన్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో కూడా బాధపడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆలోచనలు కూడా నెగిటివ్ గా ఉంటాయి. దీని వలన ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది, దీంతో ఎంతో నిరాశతో ఉంటారు. ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తారో, సరైన నిద్రను పొందలేరు. పైగా నిద్రలేమి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే అతిగా ఆలోచిస్తారో మెదడుకు విశ్రాంతి దొరకదు, దీంతో నిద్ర పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీంతో తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎప్పుడైతే అతిగా ఆలోచించడం వలన ఒత్తిడితో ఇబ్బంది పడతారో, ఇది జీర్ణవ్యవస్థ పై కూడా ప్రభావం చూపుతుంది. అసిడిటీ, కడుపునొప్పి వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అతిగా ఆలోచించడం వలన ఒత్తిడి పెరుగుతుంది, దీంతో హై బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా, గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఆలోచించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు, పైగా ఆలోచన ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. కనుక సరైన నిర్ణయం తీసుకోవాలంటే కొంత సమయాన్ని మాత్రమే ఆలోచనకు కేటాయించాలి.