రోజుకు 8 గ్లాసుల కంటే ఎక్కువ నీళ్లు తాగితే ఏం అవుతుంది..?

-

బాడీని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి అని వైద్యులు చెప్తారు. సరిపడా నీళ్లు తాగాలి లేదంటే బాడీ డీహైడ్రేట్‌ అవుతుంది. నీళ్లు ఎక్కువగా తాగినప్పుడే బ్లడ్‌ క్లీన్‌ అవుతుంది. ఫేస్‌ కూడా అందంగా ఉంటుంది.అవును ఇదంతా నిజమే.. అలా అని మరీ ఎక్కువగా తాగితే..ఎక్కువ లాభాలు వస్తాయి అనుకుంటున్నారా..? కానే కాదు.. రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే అంతకంటే ఎక్కువ నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

నీరు మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మానవ శరీరం యొక్క సరైన పనితీరులో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే మన శరీరంలో 70% నీటితోనే నిర్మితమై ఉంటుంది. ఇతర సీజన్లలో కంటే వేసవిలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం కాబట్టి, నీరు ఎక్కువగా తాగడం మంచిది. కానీ, అది కూడా మితంగానే తీసుకోవాలి. లేదంటే వాంతులు అవుతాయి.

రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ అంతకు మించి నీళ్లు తాగితే కిడ్నీలో హైపర్ ఫిల్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా, ఈ హైపర్‌ఫిల్ట్రేషన్ కొనసాగితే కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అంతే కాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో ఉప్పు స్థాయి తగ్గి వాంతులు, తల తిరగడం వంటి కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి.

వైద్యులు ప్రకారం, తక్కువ చెమట పట్టేవారు లేదా ఎక్కువ గంటలు చల్లని వాతావరణంలో పనిచేసేవారు రోజుకు 8 నుండి 12 గ్లాసుల నీరు మాత్రమే తాగాలి. అయితే చెమట ఎక్కువగా పట్టే వారు, ఒకే చోట ఆగకుండా పరుగులు తీసే వారు 12 గ్లాసుల కంటే ఎక్కువ నీరు తాగినా ఫలితం ఉండదు.

నీళ్లు తక్కువ తాగితే ఏం అవుతుంది..?
సాధారణంగా శరీరంలోని యూరియా, క్రియాటినిన్, నైట్రోజన్ ఆధారిత వ్యర్థ పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు పేరుకుపోతే వాటిని కూడా నలిపి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అందుచేత తక్కువ నీరు తాగితే శరీరంలోని వ్యర్థ పదార్థాల తొలగింపులో అడ్డంకులు ఏర్పడతాయి. ఇది మూత్రంలో రాళ్లు వంటి సమస్యలను కలిగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version