ఉద్యోగులకు ఎనిమిది నెలల జీతం బోనస్‌గా ఇస్తున్న కంపెనీ

-

ఒకప్పుడు ఏప్రిల్‌ నెల వచ్చిందంటే.. ఉద్యోగులంతా హైక్‌ల గురించి ఎదురుచూసేవాళ్లు. ఎంత శాతం ఇస్తారో ఏంటో అని తెగ ఆత్రుతగా ఉండేవాళ్లు. కానీ గత మూడేళ్లుగా ఏప్రిల్‌ వచ్చిందంటే.. ఉద్యోగుల్లో భయం మొదలవుతుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి కంపెనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో.. ఎంత మంది ఉద్యోగులను లేఆఫ్స్‌ పేరుతో పీకేయడానికి రెడీగా ఉందో అని టెన్షన్‌ పడుతున్నారు.

ఇప్పటికీ లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. పెద్ద పెద్ద కంపెనీల నుంచి స్టాట్‌ప్స్‌ వరకూ అన్నీ ఉద్యోగులను కాస్ట్‌ కటింగ్‌ పేరుతో వదిలించుకుంటున్నాయి. ఒక పక్క నష్టాల బాట సాకు అయితే ఇంకోపక్క ఏఐ తెచ్చిన పెంట.. ఏఐతోనే చాలా పనులు అయిపోతున్నాయి. మనుషుల సంఖ్యను తగ్గించేందుకు ఇదీ ఒక కారణం.. అయితే ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ కంపెనీ తన ఉద్యోగులకు ఏకంగా ఎనిమిది నెలల జీతాన్ని బోనస్‌గా ఇస్తుంది..! ఆశ్చర్యంగా ఉంది కదూ..! ఇంతకీ ఆ కంపెనీ ఏంటంటే..

సిటీ-స్టేట్ క్యారియర్ 2023-2024 ఆర్థిక సంవత్సరంలో $2.67 బిలియన్ల వార్షిక లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 24% ఎక్కువ. పోటీ ఒత్తిళ్లు, అధిక వ్యయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు ఆర్థిక అనిశ్చితిని అధిగమించడానికి ఎయిర్‌లైన్ కార్గో సేవలను మెరుగ్గా నిర్వహించడానికి ప్రయత్నించడంతో, సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఇతర విమానయాన సంస్థల కంటే వేగంగా సేవలను పునరుద్ధరించింది. కోవిడ్ -19 పరిమితులను ఎత్తివేసిన తర్వాత మార్కెట్‌ను పునరుద్ధరించింది. మార్చిలో నెలవారీ రైడర్‌షిప్ ప్రీ-కోవిడ్ రైడర్‌షిప్‌లో 97%. నికర లాభం పెరగడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ షేర్లు ఈరోజు 0.4% పెరిగాయి.

ఆర్థిక సంవత్సరంలో రికార్డు వార్షిక లాభాన్ని నమోదు చేసిన తర్వాత ఉద్యోగులకు దాదాపు ఎనిమిది నెలల జీతాన్ని బోనస్‌గా చెల్లించనుంది. మే 15న రికార్డు స్థాయిలో నికర లాభాన్ని నమోదు చేసిన తర్వాత బోనస్ ప్రకటన వెలువడింది.

Read more RELATED
Recommended to you

Latest news