అయోధ్యకు రాముడొచ్చాడు.. త్వరలో మథురకి శ్రీకృష్ణుడు రానున్నాడు – ఎంపి అర్వింద్

-

నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షునిగా దినేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ , ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. హిందూ మతానికి కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాల వల్లే.. అయోధ్య రామయ్యను చూసే భాగ్యం దక్కలేదని ఆయన అన్నారు. అయోధ్యకు రాముడొచ్చాడు.. త్వరలో మథురకి శ్రీకృష్ణుడు వస్తాడని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో గాంధీ నోటు అవసరం లేదు, మోడీ పేరుతో గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఆయన అన్నారు.

కరెంట్ కోతలు కాంగ్రెస్ పేటెంట్ అని ఆయన ఎంపి అరవింద్ ఎద్దేవ వేశారు. రుణ మాఫీ ఎప్పుడు చేస్తారో దేవుడికే తెలియాలని ,పసుపు ధర క్వింటాల్‌కు 20వేలు ధరతో పాటు నిజామాబాద్ లో 200వందల కోట్లతో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు అర్వింద్‌.

Read more RELATED
Recommended to you

Latest news