రాజ్‌భ‌వ‌న్‌లో పాయ‌సం వండిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌.. వీడియో

-

గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌందర్ రాజన్ సంక్రాంతి సంబ‌రాల్లో పాల్గొన్నారు. ఈరోజు ఆమె హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో భోగి వేడుక‌ల్ని నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఆమె కుండ‌లో పాయ‌సం వండారు. దేశ‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై భోగి పండుగ,సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న‌కు ఇది వ్య‌క్తిగ‌తంగా ప్ర‌త్యేక‌మైన పొంగ‌ల్ అని త‌మిళ‌సై పేర్కొన్నారు. ఎందుకంటే చిర‌కాల స్వ‌ప్నం అయిన రామ మందిర నిర్మాణం పూర్తి అయిన‌ట్లు తెలిపారు. శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాష‌లో ఓ పాట‌ను విడుదల చేయ‌నున్నట్లు ఆమె తెలిపింది. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వ‌ర్ధిల్లాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ఆనందంగా ఉండాల‌ని ఆమె ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఇది విక‌సిత భార‌త్ అని ఆమె చెప్పారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై శుక్ర‌వారం పాండిచ్చేరి రాజ్‌నివాస్‌లో సంక్రాంతి వేడుక‌ల్ని నిర్వ‌హించారు.

ఇవాళ సాయంత్రం గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ,హోమ్ మినిస్టర్ అమిత్ షా లతో అపాయింట్మెంట్లు ఖరారయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version