అహ్మదాబాద్లో యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోడీ రోడ్ షో

-

యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గాంధీనగర్ వరకు గ్రాండ్ రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం ఎయిర్ పోర్ట్ లో యూఏఈ అధ్యక్షుడికి నరేంద్ర మోడీ స్వాగతం పలికిన తర్వాత 3 కిలోమీటర్ల మేర మెగా రోడ్ షో ప్రారంభమైంది. గాంధీనగర్ ,అహ్మదాబాద్ లను కలుపుతూ ఇందిరా వంతెన వద్ద రోడ్ షో ముగుస్తుంది. ఈ ఈవెంట్ కోసం సమగ్ర భద్రతా చర్యలు అమలు చేసినట్లు సీనియర్ పోలీసు ఆఫీసర్ నిన్న తెలిపారు.

బుధవారం గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10 వ ఎడిషనన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. బుధవారం సమ్మిట్ ను ప్రారంభించిన , అనంతరం ప్రధాన గ్లోబల్ కార్పొరేషన్ల సీఈఓలతో ప్రధాని సమావేశమై, ఆపై గిఫ్ట్ సిటీకి బయలుదేరుతారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రధాని గ్లోబల్ ఫిన్టిక్ లీడర్షిప్ ఫోరమ్లో వ్యాపార నాయకులతో ఇంటరాక్ట్ అవుతారు.జనవరి 10 నుంచి 12 వరకు వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ గాంధీనగర్లో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news