ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మావోయిస్టుల వార్నింగ్

-

బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ప్రవర్తించినందుకు తెదేపా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హత్య చేసినట్లు మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో రాసిన లేఖలో పేర్కొంది. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా వారు అనుసరించిన మార్గంలో నే వెళ్తున్నారని పద్ధతి మార్చుకోకపోతే వారికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అధికార పార్టీకి రూ.20 కోట్లకు అమ్ముడుపోయి ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టడాన్ని మావోయిస్టులు తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు… పొట్టకూటి కోసం ఉద్యోగం చేసుకుంటున్న పోలీసులు తమకు ఆయుధాలతో దొరికినా ఎలాంటి హానితలపెట్టలేదు.. మా విప్లవ సోదరులు కనిపిస్తే పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం చాలా విచారకరమన్నారు.

మావోయిస్టుల లేఖ నేపథ్యంలో కిడారి, సోమ కుటుంబ సభ్యులతో పాటు గిడ్డి ఈశ్వరికి పోలీసులు భద్రత పెంచారు. విశాఖ మన్యంలో ఇటీవల ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే  సోమల హత్య సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version