ఎమ్మెల్యే హత్యలో పోలీసుల వైఫల్యం లేదు…హోంమంత్రి

-

మావోయిస్టుల చేతిలో ఆదివారం హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ భౌతికకాయాలకు ఈరోజు రాత్రి అరకులో  శవ పంచనామా నిర్వహిస్తారని ఏపీ హోం శాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రేపు జరగనున్న అంత్యక్రియల్లో మంత్రలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని హోం మంత్రి తెలిపారు.

అరకు డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పై స్థానికులు దాడి చేయడం విచారకరమన్నారు. మన్యంలోని  ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల దాడికి.. పోలీసుల వైఫల్యం  ఉంది అనడంలో అర్థం లేదని, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు శ్రమిస్తున్నారని చినరాజప్ప స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news