ఓటుకు నోటు కేసులో బిగుస్తున్న ఉచ్చు!

-

తెలంగాణలో సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసులో విచారణ మంగళవారం కూడా కొనసాగుతోంది.  రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయసింహా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల సందర్భంగా ఏకకాలంలో సాగిన తనిఖీల్లో ఉదయసింహను సైతం అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల నుండి కనిపించకుండా పోయిన రణ్‌ధీర్‌, మంగళవారం హైదరాబాద్‌ ఉప్పల్‌లో పోలీసులకు చిక్కారు. ఈ సందర్భంగా  తన ఇంట్లో అధికారులకు దొరికిన హార్ట్‌డిస్క్‌ గురించి రణ్‌ధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. 3 నెలల క్రితం ఉదయ సింహా హార్ట్‌డిస్క్‌ ఇచ్చాడని హార్ట్‌డిస్క్‌లో ఏముందో తనకు తెలియదని చెపుతున్నాడు. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతున్న విచారణ సర్వత్రా చర్చనీయాంశమైంది. అక్టోబర్ 3న ఐటీ అధికారుల ఎదుట రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో ఓటుకు నోటు కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version