రామ్ చరణ్ ను తక్కువ చేసి మాట్లాడినందుకు మెగా ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేశారని తెలిపారు నిర్మాత అల్లు అరవింద్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ నాకు బిడ్డ లాంటి వాడు.. ఏకైక మేనల్లుడు అన్నారు. నేను అలా మాట్లాడి ఉండకూడదు. దిల్ రాజు గురించి మాట్లాడేటప్పుడు పొరపాటు జరిగింది. దయచేసి మెగా అభిమానులు బాధపడకండి అంటూ మొరపెట్టుకున్నారు.
సీనియర్ విలేకరీ తనను ప్రశ్నించారు. ఆ సందర్భం కరెక్ట్ కాదు అని చెప్పలేదు. తనను ట్రోల్స్ చేశారు కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. ప్రజలకు నేను చెప్పాలనుకున్నది ఏంటి..? అనేది దిల్ రాజు వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్ కమ్ టాక్స్ అన్ని అనుభవించారు. ఉద్దేశ పూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు ఫీల్ అయి దానిని ట్రోల్ చేశారు.