కాంగ్రెస్ గెలుపు కార్యకర్తల ఫలితమే: మంత్రి పొన్నం

-

హైదరాబాదులో జరగనున్న రాష్ట్రస్థాయి బూతు లెవెల్ కాంగ్రెస్ ఏజెంట్ల సమావేశానికి వచ్చిన ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. మంత్రితో పాటు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య నేతలు ఉన్నారు.

ఈరోజు ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ….కాంగ్రెస్ గెలుపు కార్యకర్తల ఫలితమేనని, పార్టీ గెలుపుకు బూత్ లెవెల్ కన్వీనర్స్ వెన్నుముకలాగా పనిచేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బూత్ లెవల్ కన్వీనర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులం అని తెలిపారు. మా గెలుపును కేటీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news