కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందుత్వం: మల్లు రవి

-

సిటీలోని గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి మాట్లాడుతూ…..కాంగ్రెస్ డీఎన్ఏ లోనే హిందుత్వం ఉందని అన్నారు.అయోధ్య లో రామాలయానికి రాజీవ్ గాంధీ హయాంలోనే ఫౌండేషన్ వేశారని తెలిపారు. కొందరు కోర్టులో కేసు వేయడంతో నిర్మాణం ఆగి పోయిందన్నారు. దేశంలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆనాడు హిందువుల కోసమే కాంగ్రెస్ నేతలు స్వాతంత్ర పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. మతం పేరుతో కిషన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను ప్రేమించాలని, ఒకే మతాన్ని కాదని ఆయన అన్నారు.

తలంబ్రాల పంపిణీ పేరుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ చేపట్టే న్యాయ్ యాత్రపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన కామెంట్స్ ఆయన ఖండించారు. చేసిన అభివృద్ధిపై ప్రచారం చేసుకోనందునే తాము ఓడిపోయామని కేటీఆర్ అనడం సిగ్గుచేతు అన్నారు. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్లు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version