కొండా దంప‌తుల‌కు సొంత ప్ర‌యోజ‌నాలే ముఖ్యం..గుండు సుధారాణి

-

అడిగిన‌న్ని సీట్లు ఇవ్వలేదు కాబట్టి కొండా సురేఖ దంప‌తులు కేసీఆర్ పై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని తెరాస నేత గుండు సుధారాణి అన్నారు. వారి వైఖ‌రిని వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. మీడియా స‌మావేశంలో సుధారాణి మాట్లాడుతూ… కొండా దంప‌తుల‌కు సొంత ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని ఆమె విమ‌ర్శించారు.

తెలంగాణ కోసం పోరాటం చేసిన చ‌రిత్ర కేసీఆర్ ది.. ఉద్య‌మ‌కారుల‌పై దాడులు జ‌రిపిన చ‌రిత్ర మీది…పార్టీలో నుంచి వెళ్లిపోయేట‌ప్పుడు ఏదో విధంగా తెరాస‌ను దెబ్బ‌గొట్టాల‌నుకున్నారు.

తెరాస‌లో గ్రూపు త‌గ‌దాలు ఉన్నాయంటూ కొత్త అంశాన్ని తెర‌పైకి తెచ్చి ఏదో జ‌రిగిపోతుంది అనుకుంటే అది వారి తెలివి త‌క్కువ త‌న‌మే…తెరాస‌లో ఎలాంటి గ్రూపులు లేవు ఉన్న‌ది కేసీఆర్ టీం అంటూ వివ‌రించారు.  తెరాస నుంచి కొండా దంప‌తులు వెళ్లిపోవ‌డంతో వ‌రంగ‌ల్ ప్ర‌జ‌లు పీడ విర‌గ‌డైంద‌ని సంతోషంగా చ‌ర్చించుకుంటున్నారంటూ..తెరాస నేత బ‌స్వ‌రాజు సారాయ్య అన్నారు. అధినేత సీటు ఎవ‌రికి కేటాయించిన అత్య‌ధిక మెజార్టీతో గెలిపిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news