ఖమ్మం ఎంపీ పొంగులేటి ఇంట్లో ఐటీ తనిఖీలు

-

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు చెందిన కార్యాలయం తో పాటు శ్రీనివాస్ రెడ్డి స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో మొత్తం 18 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

2014 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత మారిన పరిణామాల కారణంగా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రజా నివేదన సభకు ఖమ్మం నుంచి అధిక సంఖ్యలో రైతులు, తెరాస కార్యకర్తలు హాజరుకావడంలో శ్రీనివాస్ రెడ్డి పాత్రం కీలకం.

Read more RELATED
Recommended to you

Latest news