ఢిల్లీలో నీటి సరాఫరను పరిశీలించిన మంత్రి అతిషి

-

ఈ సంవత్సరం వేసవిలో ఎన్నడూలేని విధంగా నీటి కొరతను ఎదుర్కొన్న ఢిల్లీకి ఇటీవల మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరట కల్పించాయి..దీంతో కొన్ని ఏరియాల్లో తాత్కాలికంగా నీటి సమస్య తీరిపోయింది. ఈ క్రమంలో మంత్రి అతిషి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన చంద్రవాల్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని పంప్‌హౌస్‌ను ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని, తిరిగి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.అనూహ్య వర్షాల వల్ల ఈ ప్లాంట్‌లో మోటార్లు దెబ్బతినడంతో సెంట్రల్ ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి జల్ బోర్డు త్వరగా పనిచేసింది. ప్లాంట్ దాదాపు 80 శాతం మరమ్మతులకు గురైంది. నీటి సరఫరా త్వరలో సాధారణ స్థితికి వస్తుందని అతిషి తెలిపారు. ఇటీవల శుక్రవారం ఢిల్లీలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version