ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు తేదీ పొడిగింపు

-

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకోసం గడువు తేదీని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. జూలై 31 వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించింది.జూన్ 28న పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ కావడంతో పాస్ అయిన విద్యార్థులకు అవకాశం ఇచ్చేందుకు ఈ గడువు తేదీని పొడిగించినట్లు బోర్డు వెల్లడించింది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలలో ఇంటర్ ఫస్టియర్ జనరల్,ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రక్రియ కొనసాగుతుంది. పదో తరగతి గ్రేడ్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు చేస్తారు. ఇంటర్ అడ్మిషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డ్ విద్యార్థులకు సూచించింది. బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లో మాత్రమే చేరాలని తెలిపింది. గుర్తింపు పొందిన కళాశాల వివరాలను ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఉంచింది. వివరాలను చెక్ చేసుకుని అడ్మిషన్లు పొందాలని బోర్డు సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version