తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్..

-

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు రాజీనామా ..

కాంగ్రెస్ పార్టీకి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన ఎప్పటినుంచో ఆశిస్తున్న రాజేంద్రనగర్ సీటు తనకు దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. కార్తీక్ నిర్ణయానికి మద్ధతుగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, డివిజన్ అధ్యక్షులు కూడా పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎప్పటి నుంచి రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నా అన్నారు. అయినప్పటికీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నుంచే ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచి.. తన సత్తా చాటాలని కార్తీక్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. కార్తీక్‌ రెడ్డి రాజీనామాతో తల్లి సబితా ఇంద్రారెడ్డి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version