దుబాయ్‌లో ధోని విహార‌యాత్ర‌..! పిక్స్ వైర‌ల్‌.. కృతిసన‌న్‌, నుపుర్ స‌న‌న్, సాక్షి ఇంకా..

-

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంత‌ర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు . ఐపీఎల్‌లో సిఎస్కె కు సారథిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో త‌న జ‌ట్టును విజేత‌గా నిలిపి ఐదో సారి టైటిల్ ను చెన్నై జ‌ట్టుకు అందించాడు.

కాగా.. ప్ర‌స్తుతం ధోని త‌న ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్‌కు విహార‌యాత్ర‌కు వెళ్లిన‌ట్లుగా సమాచారం. న్యూ ఇయర్ వేడుక‌ల‌ను దుబాయ్ లోనే ప్లాన్ చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా.. దుబాయ్‌లో ధోని, అత‌డి భార్య సాక్షిలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్‌, నుపుర్ స‌న‌న్ కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే. వచ్చే ఐపీఎల్ 2024 సీజ‌న్ ధోనికి చివ‌రిది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ధోని ఏమి స్పందించ‌లేదు. అయితే.. సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వ‌నాథ్ దీనిపై మాట్లాడుతూ ధోని కి చివ‌రి సీజ‌నో కాదో కేవ‌లం అతను మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌డ‌ని అన్నారు. ఈ విషయం గురించి నేరుగా ధోనినే స‌మాధానం చెబుతాడ‌ని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వ‌నాథ్ అన్నాడు. ఐపీఎల్ 2023లో ధోని మోకాలికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news