నానినిచూస్తే శోభన్ బాబు గుర్తుకు వస్తారు..మురళీ మోహన్

-

నేటితరంయువకథానాయకుల్లో నానిని చూస్తే శోభన్ బాబు గుర్తుకు వస్తారని ప్రముఖ నటుడు,రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ తెలిపారు. అఖిల భారత శోభన్ బాబు సేవాసమితి ఆధ్వర్యంలోరూపొందించిన అవార్డు పోస్టర్‌ను శోభన్‌బాబు సేవా సమితి సభ్యులతో కలిసి మురళీమోహన్హైదరాబాద్‌లో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ… అలనాటినటుల్లో శాశ్వత అభిమానులు కలిగిన శోభన్‌బాబు.. ఎంతో మంది సినీ కార్మికులనుఆదరించారని చెప్పారు.

నటుడు శోభన్‌బాబు సలహాతోనే తాను ఆర్థికంగా నిలబడగలిగానని ఆయనగుర్తుచేసుకున్నారు.. అంతటి గొప్ప నటుడు పేరుతో చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు పురస్కారాల వేడుకనిర్వహించడం అభినందనీయమని తెలిపారు. శోభన్‌బాబు పేరుతో డిసెంబర్ 25న జరిగే వేడుకలను పరిశ్రమలోనినటీనటులంతా పండులా నిర్వహించుకోవాలన్నారు. నాటి తరం కథానాయకుల్లో శోభన్ బాబుఅత్యంత ప్రత్యేకం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news