నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ ప్రచారం

-

ప్రజా ఆశీర్వాద సభల పేరుతో దూకుడు పెంచిన సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ఎన్నికల సమావేశాన్ని వనపర్తిలో ఏర్పాటు చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తనున్నారు. శుక్రవారం  మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సభ ప్రాంగణానికి చేరుకుంటారు. సభా వేదికపై నుంచి  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించిన ఎన్నికల ప్రచారానికి నాంది పలుకనున్నారు. భారీ సంఖ్యలో తెరాస కార్యకర్తలు, జనం హాజరయ్యాల స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.  సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news