న‌ల్ల‌గొండ జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం.. ఇల్లు ద‌గ్ధం

-

న‌ల్ల‌గొండ : మిర్యాల‌గూడ మండ‌లం కొత్త‌సామ్య తండాలో ఈరోజు మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం జరిగింది. ఓ ఇంట్లో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెలరేగిపోవడంతో క్ష‌ణాల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని చాలాసేపు శ్రమించి మంట‌ల‌ను అదుపు చేసింది.

బాధితుడు హ‌నుమ నాయ‌క్ మాట్లాడుతూ.. షార్ట్ స‌ర్క్యూట్‌తో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుందని, అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పాడు. అగ్నికీల‌లు ఎగిసిప‌డిన స‌మ‌యంలో ఇంట్లో 7 తులాల బంగారం,రూ. 5 ల‌క్ష‌ల న‌గ‌దు ఉన్నట్లు తెలిపాడు. న‌గ‌దు పూర్తిగా మంటలలో కాలిపోయిందని హ‌నుమ నాయ‌క్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news