మిర్యాలగూడ పరువు హత్యపై .. మంచు మనోజ్ లేఖ

-

మిర్యాలగూడలో సంచలనం రేపిన పరువు హత్య కేసుకు సంబంధించి సినీ హీరో మంచు మనోజ్ లేఖ రాశారు.  కులం, మతం ఎక్కువని భావించే వారికే ఈ లేఖ అంటూ.. వ్యవస్థలో పేరుకుపోయిన కుల పిచ్చి ప్రణయ్ లాంటి యువకుడిని బలిగొంది. కులం మతం కంటే ముందు జీవితమంటే ఏమిటో తెలుసుకోండి. తల్లి గర్భంలోని శిశువు తన తండ్రి స్పర్శని- ప్రేమని అనుభవించడానికి వీల్లేకుండా కులం కారణంగా ప్రణయ్ ని హత్య చేయడం చాలా బాధాకరం… మనుషుల జీవితాల కంటే కులాలు ఎక్కువా? అంటూ మనోజ్ లేఖలో ప్రశ్నించారు.

మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పుడు గుర్తిస్తుందో.. కులాన్నిమతాన్ని జీవితం కంటే ఎక్కువగా ప్రేమించే వారి వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.


 

ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలి… అమృత‌కు, ప్రణయ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ ట్విటర్ వేదికగా లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news