మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ ఇవ్వమని అడిగా- ఈటెల రాజేందర్

-

మరి కొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో  మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కరీంనగర్ లో సిట్టింగ్ ఎంపి ఉన్నాడు కాబట్టి నేను అక్కడి నుంచి టికెట్ ఆశించడం లేదని తెలిపారు. తనకు కరీంనగర్ బదులుగా మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వమని బీజేపీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.

నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని కొందరు అసత్యం ప్రచారం చేస్తున్నారని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి ప్రచారాలను నమ్మవద్దని అన్నారు.ఆమెరికా లాంటి అగ్రరాజ్యం ఇండియాకి రెడ్ కార్పెట్ వేస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ వల్లే మన దేశం ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు. 2018 లో కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారని అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రెండవ విడత దళిత బంధు నీతులు వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version