తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. సీఎం హామీతో ముందడుగు..!

-

యూకే కి చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్ స్ట్రూమెంట్స్ గ్రూపు హోల్డింగ్స్ హైదరాబాద్ లో తమ తయారీ యూనిట్ పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడ తయారు చేయనున్నారు. అందుకోసం రూ.231.5 కోట్ల పెట్టుబడులు సంస్థ పెడుతామని ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్ లోకి అడుగు పెడుతోంది. ఈ ఫెసిలిటీ ఏర్పాటు తో హెల్త్ కేర్ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేయనుంది. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎం.డీ. గౌరీ శ్రీధర, డైరెక్టర్ అమర్ చీడిపోతూ తాజాగా సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలో జనరల్ సర్జికల్ పరికరాలు, మైక్రో సర్జరీకి ఉపయోగించే అధునాతన పరికరాలను తయారు చేస్తారు. ప్రధానంగా ఆర్థోపెడిక్, చర్మ, నేత్ర సంబంధిత సర్జరీలకు అవసరమయ్యే వాటిని తయారు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version