రాజ్యసభ సీటుపై స్పందించిన అలీ..

-

ఏపీలో త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ సీట్లపై ప్రస్తుతం హాట్‌ హాట్‌ చర్చలు జరుగుతున్నాయి. రాజ్యసభ సీటును సంపాందించేందుకు ఆశావాహులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఏప్పటినుంచో కరాజ్యసభ సీటుపై స్పందించిన అలీ..మేడియన్ అలీకి రాజ్యసభ సీటును వైసీపీ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వైసీపీ రాజ్యసభ సీట్లను కేటాయిస్తూ పేర్లను ఖరారు చేసింది. వైసీపీ రిలీజ్‌ చేసిన లిస్ట్‌లో అలీ పేరు లేకపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలో… అలీ మాట్లాడుతూ.. రాజ్యసభ సీటును తాను ఆశించలేదని చెప్పారు.

జగన్ దృష్టిలో తాను ఉన్నానని… తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా బాధ్యతగా నిర్వర్తిస్తానని అన్నారు. నీకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ గట్టిగా చెప్పలేదని… అయితే ఏదో ఒక పదవి ఇస్తానని మాత్రం చెప్పారని… తనకు కూడా ఆ నమ్మకం ఉందని చెప్పారు. వక్ఫ్ బోర్డు పదవి కూడా తనకు ఇవ్వలేదని… ఇప్పటికే దాన్ని ఇతరులకు కేటాయించారని అన్నారు. ఏదో ఒక రోజు జగన్ నుంచి పిలుపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అలీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version