Telangana: పరీక్షల ఒత్తిడి.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య !

-

పరీక్షల ఒత్తిడి.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ మహా నగరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నగరం చందానగర్‌కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.

Hyderabad Dixit Raju from Chandanagar is studying inter-secondary in a private college in Miyapur

ఈ నెల 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయాడు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version