సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉంది: రష్మిక మందన్న

-

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీ బిజీ గా ఉంది. సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్గా ఉండే రష్మీక తన తన గ్లామర్ తో అలాగే అద్భుతమైన నటనతో నేషనల్ క్రష్ గా మారింది.. రష్మిక ఎప్పుడూ కూడా ట్రేండి గా ఉంటుంది.టాలీవుడ్ లో ఈ భామ గీతగోవిందం,సరిలేరు నీకెవ్వరు,ఛలో, భీష్మ వంటి చిత్రాలతో వరుస గా హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్ అయింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన మనసులోని మాటను బయటపెట్టారు. అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్య బయోపిక్లో నటించాలని ఉందని చెప్పారు. ‘సౌందర్య అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నన్ను కుటుంబ సభ్యులంతా సౌందర్యలా ఉంటావని అనేవారు. అవకాశం వస్తే సౌందర్య బయోపిక్లో నటిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యానిమల్తో హిట్ అందుకున్న రష్మిక ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news