లారీలో పేలిన 100 సిలిండర్లు.. తప్పించుకున్న డ్రైవర్.. వాహనం దగ్ధం

-

కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు ఓ లారీ భారత్ గ్యాస్ సిలిండర్లతో వెళ్తోంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామం సమీపాన ఉన్న అనంతపురం గుంటూరు జాతీయ రహదారిపైకి రాగానే లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన వెంటనే డ్రైవర్‌ మోహన్‌రాజు లారీ ఆపి కిందికి దిగి తప్పించుకున్నారు.

ఈ మంటలు లారీలో వ్యాపించగా వాహనంలో ఉన్న 300 సిలిండర్లలో 100కు పైగా సిలిండర్లు పేలాయి.  అప్రమత్తమైన పోలీసులు రహదారికి ఇరు వైపులా అర కి.మీ. దూరంలో వాహనాలు నిలిపివేశారు.  ప్రమాద స్థలానికి 300 మీటర్ల దూరంలో ఉన్న దద్దవాడలో సుమారు 30 ఇళ్లను ఖాళీ చేయించారు. ప్రమాద స్థలానికి అగ్నిమాపక వాహనం వెళ్లినప్పటికీ సిలిండర్లు పేలుతుండటంతో 200 మీటర్ల దూరం నుంచే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. గ్యాస్‌ లారీలో సిలిండర్లు భారీగా పేలడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. అటువైపు రాకపోకలను నిలిపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version