దేశవ్యాప్తంగా 103 అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్లు ప్రారంభించాం: ప్రధాని మోదీ

-

ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా 103 అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్లు ప్రారంభించామన్నారు ప్రధాని మోదీ. కర్ణి మాత ఆశీస్సులతో వికసిత్‌ భారత్‌ సాధనలో ముందుకెళ్తామని… అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లకు అమృత్‌ భారత్‌ అని నామకరణం చేశామని వెల్లడించారు.

pm modi
103 Amrit Bharat Railway stations inaugurated across the country PM Modi

దేశంలో 1300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేయాలని నిర్ణయించామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపరేషన్ సిందూర్‌పై దేశ ప్రజలు గర్వపడుతున్నారని పేర్కొన్నారు మోదీ. ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. కేవలం 22 నిమిషాల్లోనే 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో త్రివిధ దళాలు సంయుక్తంగా సత్తా చాటాయని పేర్కొన్నారు. మహిళల సిందూరం చెరిపినవారిని మట్టిలో కలిపామని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ.

Read more RELATED
Recommended to you

Latest news