సూర్యాపేటలో కరోనా కలకలం.. ఒకే ఇంట్లో 22 మందికి !

-

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా కలకలం రేపింది. పట్టణంలో యాదాద్రి టౌన్ షిప్ లో  ఓ ఇంట్లో ఇటీవలే జరిగిన అంత్యక్రియలకు సుమారు 30 మంది హజరు కాగా అందులో ఒకే ఇంటికి చెందిన బంధువులలో 22 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు.

corona

ఈ క్రమంలో అప్రమతమైన అధికారులు కాలనీలో  వైద్య సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి కరోన నిర్ధారణ అయిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచి వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ అంశం మీద జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ కరోన లక్షణాలు కల్గిన వారందరికి తగిన మెడిసిన్ అందిస్తూ సూచనలు ఇస్తూ వైద్యుల పర్య వేక్షణలో  ఉంచారమని ఎవ్వరు భయ పడాల్సిన అవసరం లేదనీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version