నలుగురు ఆడపిల్లల గొంతు కోసి, ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి !

-

హర్యానాలోని నూహ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకటి నుంచి ఏడేళ్ల మధ్య వయసున్న నలుగురు అక్క చెల్లెళ్ళను గొంతు కోసి చంపినట్టు గుర్తించారు. అయితే ఈ నేరానికి పాల్పడినట్లు వారి తల్లిపై పోలీసులు అభియోగాలు మోపారు. ఈ పిల్లల తండ్రి నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తీవ్రంగా గాయపడి తరువాత ఆసుపత్రిలోని ఐసియులో చేరిన తల్లిపై కేసు నమోదైందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

పున్హానా పోలీస్ స్టేషన్, పిప్రోలి గ్రామంలో ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. 1-7 సంవత్సరాల వయస్సు గల నలుగురు బాలికలని గొంతు కోసి చంపారు. ఈ నలుగురిని వారి తల్లి చంపి తర్వాత ఆమె గొంతు కోసుకున్నట్లు భావిస్తున్నారు, ఆమెను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో  మరియు ఐసియులో చేర్చారు అని పోలీసులు చెబుతున్నారు. యా మహిళ ఎందుకు అలాంటి చర్య తీసుకుందో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news