గుడివాడ క్యాసీనోలో 500 కోట్ల లావాదేవీలు జరిగాయి – వర్ల రామయ్య

-

గుడివాడ క్యాసినో నిర్వహణకు సంబంధించి ఐటీ అధికారులతో టిడిపి నేతల సమావేశం ముగిసింది. క్యాసినో నిర్వహణపై చికోటి ప్రవీణ్ ప్రచారం చేసిన ఆధారాలు, గోవా నుంచి వచ్చిన మహిళల విమాన టికెట్ల వివరాలు ఐటి కి ఇచ్చినట్లు టిడిపి నేత వర్ల రామయ్య తెలిపారు. చికోటి ప్రవీణ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ అంతా ఒకటేనని.. గుడివాడ కేసీనోలో 500 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు వర్ల రామయ్య ఆరోపించారు.

200 కోట్లనుంచి 500 కోట్ల వరకు మనీ లాండరింగ్ జరిగిందని ఈడికి తెలిపామన్నారు వర్ల రామయ్య. దీనిపై ఈడి చర్యలు తీసుకోవాలన్నారు. నేపాల్ తీసుకువెళ్లిన చీకొటి గుడివాడ కూడా తీసుకువచ్చాడని అన్నారు. నేపాల్ క్యాసినో అయిన గుడివాడ క్యాసినో అయినా ఒకటేనన్నారు వర్ల రామయ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version