BREAKING : సూర్యాపేట ర్యాంగింగ్ కేసులో 6 విద్యార్థులు సస్పెండ్‌

-

సూర్యాపేట మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థి పై ర్యాంగింగ్ ఘటనకు సంబంధించి 6 విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు డిఎంఈ రమేష్ రెడ్డి. 2019-20 బ్యాచ్ కి చెందిన ఆరుగురు విద్యార్థులను ఏడాది పాటు కళాశాల నుంచి సస్పెండ్ చేయడం తో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా పంపించి వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

జె మహేందర్, జి శశాంక్ , పి శ్రవణ్, ఏ. రంజిత్ సాయి, కె హరీష్, బి సుజిత్ లను ఏడాది పాటు సస్పెండ్ చేసిన డిఎంఈ.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌ కు చెందిన ఓ విద్యార్తి సూర్యపేట మెడికల్‌ కాలేజ్‌ లో ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఇంటి నుంచి శనివారం రాత్రి హాస్టల్‌ కు చేరుకున్న అతడిని ద్వితీయ సంవత్సరానికి చెందిన దాదాపు 25 మంది స్టూడెంట్స్‌ తమ గది లోకి రమ్మన్నారు. అతడి దుస్తులు విప్పించి… సెల్‌ ఫోన్‌ లో వీడియో తీశారు. అప్పటికే మద్యం తాగి ఉన్న వారు అతడి పై దాడికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనపై సీరియస్‌ అయిన అధికారులు తాజాగా యాక్షన్‌ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news