హైదరాబాద్‌ పోలీసులకు ఝలక్‌..బైక్‌ ఆపారని తగలబెట్టాడు..వీడియో వైరల్

-

హైదరాబాద్‌ పోలీసులకు ఝలక్‌ ఇచ్చాడు ఓ వాహనదారుడు. బైక్‌ ఆపారని ఏకంగా.. తన బైక్‌ ను తగలబెట్టాడు. ఈ ఘటన మైత్రివనం కూడలి దగ్గర చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..ఎల్లారెడ్డి గూడకు చెందిన అశోక్‌ అనే వ్యక్తి.. మైత్రివనం కూడలి వైపునకు వచ్చాడు.

అయితే.. అశోక్‌ రాంగ్‌ రూట్‌ లో వెళ్లడంతో.. పోలీసులు అశోక్‌ ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ఆగ్రహానికి గురైన అశోక్‌… తన ద్విచక్ర వాహనాన్ని తానె పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో పోలీసులు షాక్‌ గురయ్యారు. ప్రస్తుతం అశోక్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఇది ఇలా ఉండగా.. ఆపరేషన్ రోప్ లో భాగంగా ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ ను హైదరాబాద్ పోలీసులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొత్తం 472 మంది వాహనదారులు, 18 వ్యాపార సముదాయాల యజమానులకు చలాన్లు విధించారు ట్రాఫిక్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version