రాజ‌స్థాన్ లో దారుణం : కూతుళ్ల తో స‌హా బావిలో దూకిన త‌ల్లి

-

రాజ‌స్థాన్ రాష్ట్రం లో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఐదుగురు కూతుళ్ల తో క‌ల‌సి ఒక త‌ల్లి బావి లో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అయితే మ‌రో ఇద్ద‌రు కూతుళ్లు నిద్ర పోవ‌డం తో వారిని నిద్ర లో నుంచి లేప‌కుండా ఐదుగురిని మాత్ర‌మే బావి ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌చ్చి.. దూకి ఆత్మ హ‌త్య చేసుకుంది. మృతుల్లో త‌ల్లి బాదం దేవి (40) తో పాటు కూతుళ్లు సావిత్రి (14), అంజ‌లి (8), కాజ‌ల్ (6), గుంజ‌న్ (4), అర్చ‌న (1) ఉన్నారు.

కాగ ఈ ఘ‌ట‌న కు కార‌ణం కుటుంబ క‌ల హాలే కార‌ణ‌మ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. త‌ల్లి క్ష‌ణికావేశం లో మాత్ర‌మే ఇలా చేసింద‌ని అనుమానిస్తున్నారు. కాగ ఈ ఘ‌ట‌న స‌మ‌యం లో గాయ‌త్రి, పూన‌మ్ అనే కూతుళ్లు నిద్ర పోవడం తో వీరి ప్రాణాలు ద‌క్క‌యి. అయితే ఈ ఘ‌ట‌న లో చిన్న చిన్న పిల్లలు చ‌నిపోవ‌డం తో ఇది దారుణం అయిన ఘ‌ట‌న అని అక్క‌డి పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version