యువకుడి పంట పండింది.. ఏకంగా రాత్రికి రాత్రే..!

-

సాధారణంగా డబ్బు సంపాదించాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రమే ఎక్కువగా అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని విధంగా ధనలక్ష్మి వరిస్తూ ఉంటుంది. ఇక్కడ యువకుడికి ఇలాగే జరిగింది. ఖాళీగా ఉన్న సమయంలో డైమండ్ కోసం వెతుకుతుండగా ఏకంగా ఎంతో విలువైన వజ్రం యువకుడికి దొరికింది. దీంతో రాత్రికి రాత్రే లక్షాధికారి గా మారిపోయాడు యువకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

బుందేల్ఖండ్ జిల్లాలోని కళ్యాన్పూర్ ఏరియా కు చెందిన సందీప్ యాదవ్ ప్రభుత్వం నుంచి కొంత డైమండ్ మైన్ భూభాగాన్ని లీజుకు తీసుకుని అక్కడ విలువైన రాళ్ళ వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అతనికి అదృష్టం వరించింది 30 లక్షలకు పైగా విలువ చేసే ఒక అరుదైన వజ్రం అతనికి చేజిక్కింది. దీంతో రాత్రికి రాత్రే సందీప్ యాదవ్ లక్షాధికారి గా మారిపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version