దిల్లీలో ఆప్, బీజేపీ మధ్య తోపులాట.. కుప్పకూలిన కౌన్సిలర్

-

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మరోసారి రసభాసా జరిగింది. మరోసారి బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆప్ కౌన్సిలర్ ఒకరు అక్కడికక్కడే కుప్పకూలారు.

సుప్రీంకోర్టు తీర్పుతో దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రశాంతంగా జరిగినా.. ఆరుగురు స్టాండింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ సాఫీగా సాగడం లేదు. మూడో రోజు కూడా స్టాండింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కాగానే ఎంసీడీ సదన్‌ గందరగోళంగా మారింది. బీజేపీ, ఆప్​ కౌన్సిలర్ల మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆప్ కౌన్సిలర్​ అశోక్​ కుమార్ అక్కడే కుప్పకూలిపోయారు.

ఆరుగురు సభ్యులను ఎన్నుకునే పోలింగ్ ప్రక్రియలో కేవలం ఒ‍క ఓటు చెల్లదని మేయర్ షెల్లీ ఒబెరాయ్‌ ప్రకటించిన నేపృథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ కౌన్సిలర్లు పరస్పరం దాడులకు దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు. కౌంటింగ్ నిలిపివేయాలని డిమాండ్​ చేశారు. కొందరు నేతలు పరస్పరం చెంప దెబ్బలకు దిగగా మరికొందరు వస్త్రాలను చించుకున్నారు. దీంతో సభ ఉద్రిక్తంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version