సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదల

-

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్​లకు కేంద్రప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అందులో  సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఒకటి. ఎన్నికల ప్రణాళికను రూపొందించిన బోర్డు… అభ్యంతరాలు ఉంటే చెప్పాలని బోర్డు సీఈవో మధుకర్ నాయక్ కోరారు.

మార్చి 1 నుంచి 4 వరకు కంటోన్మెంట్ ఎన్నికల ఓటర్ల సవరణ చేయనున్నారు. మార్చి 1 నుంచి 4 వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు మధుకర్   వెల్లడించారు. మార్చి 23న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుండగా.. మార్చి 28, 29 తెేదీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అదే విధంగా ఏప్రిల్ 6న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల నుంచి పేర్లను ప్రకటించడం జరుగుతుంది. ఇక కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ఏప్రిల్ 30న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

దేశంలోని 57 కంటోన్మెంట్​లకు కేంద్రప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం కంటోన్మెంట్ బోర్డులో అత్యవసర సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశేఖర్, సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పాల్గొని ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఈఓ మధుకర్ నాయక్ పలు అంశాలపై మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version