గొప్ప మనసు చాటుకున్న నటి ఐశ్వర్య రాజేష్..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ లలో తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. ఈమె తెలుగు హీరోయిన్ అయినప్పటికీ కూడా తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయింది. ప్రముఖ సీనియర్ నటి లక్ష్మి మేనకోడలే ఐశ్వర్య రాజేష్. రిపబ్లిక్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ వంటి సినిమాలలో నటించింది . కానీ ఈ సినిమాలు ఒక సినిమా తర్వాత మరొకటి ఫ్లాప్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఐశ్వర్య రాజేష్ కి సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడంలేదని చెప్పాలి.

డిసెంబర్ చివరి వారంలో ఐశ్వర్య రాజేష్ డ్రైవర్ జమున సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అస్సలు అందుకోలేదు. తాజాగా ఐశ్వర్య రాజేష్ చేసిన మంచి పని ద్వారా ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది . ట్రెడిషనల్ రోల్స్ కు ప్రాధాన్యత ఇస్తున్న ఈమె డ్రైవర్ జమున ప్రమోషన్స్ లో భాగంగా 40 మంది ఆటో డ్రైవర్లను పిలవడం జరిగింది. ప్రమోషన్స్ లో హాజరైన 40 మంది మహిళల్లో ఒక మహిళకు ఐశ్వర్య ఆటోను గిఫ్ట్ గా ఇచ్చారు. కొత్త ఆటో కొని బహుమతిగా ఇచ్చిన ఐశ్వర్య రాజేష్ గొప్పతనాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

ఐశ్వర్య తన తదుపరి ప్రాజెక్టులో సక్సెస్ కావాలని తెలుగులో కూడా హీరోయిన్గా బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. చాలామంది హీరోయిన్లతో పోలిస్తే రెమ్యునరేషన్ తక్కువగా తీసుకుంటూ ఉండడం ప్లస్ అయ్యింది అని చెప్పవచ్చు. గ్లామర్ ప్రపంచంలో ఆమె మరింతగా అవకాశాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version