ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదు – సోము వీర్రాజు

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కందుకూరు, గుంటూరు పర్యటనలలో తొక్కిసలాట ఘటనపై స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు. ఈ ఘటనలపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. కందుకూరి ఘటన మరవకముందే మరో ఘటన జరగడం బాధాకరమన్నారు.

గుంటూరు ఘటన నిర్వాహకుల వైఫల్యం బయటపడిందని మండిపడ్డారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదని హితవు పలికారు. ఇలాంటి ఘటనలను అధికారమే పరమావధిగా పార్టీలో పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version