బాలీవుడ్ లో మ‌రో విషాదం..ప్ర‌ముఖ‌ న‌టి హ‌ఠాన్మ‌రణం..!

-

బాలీవుడ్ లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి హ‌ఠాన్మ‌రణం చెందింది. జోదా అక్బ‌ర్ సీరియ‌ల్ లో స‌లీమా భేగం పాత్ర‌లో న‌టించిన మ‌నీషా యాదవ్ శుక్ర‌వారం మృతి చెందింది. అయితే మృతి చెందిన త‌ర‌వాత వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా మెద‌డులో ర‌క్త స్రావం వ‌ల్ల‌నే న‌టి మృతి చెందిన‌ట్టు వైద్యులు నిర్దారించారు. ఇదిలా ఉండ‌గా మ‌నీషాకు ఇప్ప‌టికే వివాహం జ‌ర‌గ్గా ఏడాది వ‌య‌స్సు గ‌ల కుమారుడు కూడా ఉన్నాడు. మ‌నీషా యాద‌వ్ సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ త‌న కుమారుడి ఫోటోల‌ను షేర్ చేస్తు ఉంటుంది. దాంతో ఆ చిన్నారి బాబును ఎవ‌రు చూసుకోవాలి అని నెటిజ‌న్లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌నీషా త‌న కుమారుడితో క‌లిసి ఉన్న ఫోటోలు అంద‌రి హృద‌యాల‌ను క‌లిచివేస్తున్నాయి. ఇక మ‌నీషా తో క‌లిసి న‌టించిన ప‌రిధి శ‌ర్మ ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. జోదా అక్బ‌ర్ లో న‌టించే స‌మ‌యంలో మ‌నీషాతో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని ఆ త‌ర‌వాత తాము ఓ వాట్స‌ప్ గ్రూప్ ను క్రియేట్ చేసుకుని చాట్ చేసుకునే వాళ్ల‌మ‌ని చెప్పింది. మ‌నీషా మ‌ర‌ణం బాధించిందని ప‌రిధి శ‌ర్మ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news