తీన్మార్ మల్లన్నషాక్.. టిఆర్ ఎస్ లో చేరిన రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య

-

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ నియోజక వర్గంలో రాజకీయాలు హాట్‌ హాట్‌ గా నడుస్తున్నాయి. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక తరుముకొస్తున్న తరుణంలో.. కీలక నేతలు కండువాలు మార్చేస్తున్నారు. అటు పార్టీలు కూడా… కీలక నేతలకు గాలం వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న బిగ్‌ షాక్‌ తగిలింది.

తాజాగా టి ఆర్‌ ఎస్ పార్టీ లో చేరారు రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య. కాసేపటి క్రితమే… రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య… తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. రిటైర్డ్‌ సీఐ దాసరి భూమయ్య తో పాటు ఏకంగా 100 మంది తీన్మార్ మల్లన్న టీం సభ్యులు టీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరుతున్నట్లు ప్రకటన చేశారు.

రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య… గతంలో హుస్నాబాద్‌ లో సీఐ గా పనిచేసి… రెండు సంవత్సరాల కిందటే.. రిటైర్డ్‌ అయ్యారు. అంతేకాదు దాసరి భూమయ్య… హుజురాబాద్‌ కు చెందిన వాడు కావడం గమనార్హం. కాగా… హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక… అక్టోబర్‌ 30 న జరుగనుండగా… నవంబర్‌ 2 వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news