Actress Pakeezah: పూట గ‌డ‌వ‌ని దీన స్థితిలో న‌టి పాకీజా

-

పూట గడవని దీన స్థితిలో ఉన్నానంటూ నటి పాకీజా  తెలిపారు. తన ఆర్థిక పరిస్థితి పూర్తిగా బాగోలేదని కనీసం పూట కూడా గడవక భిక్షాటన చేసే పరిస్థితులలో ఉన్నానంటూ నటి పాకీజా వెల్లడించారు. తన వద్ద ఉన్న డబ్బులు అన్నీ కూడా తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసమే ఖర్చు చేశానని పాకీజా వాపోయారు.

PAAKIJA
PAAKIJA

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను కలిసేందుకు గుంటూరుకు వచ్చారని వెల్లడించారు. నా పరిస్థితిని గురించి తెలిసి కూడా తమిళ సినీ పరిశ్రమ ఏమాత్రం నన్ను పట్టించుకోలేదు. గతంలో నాగబాబు, చిరంజీవి నా పరిస్థితిని చూసి నన్ను ఆదుకున్నారని పాకీజా అన్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాస్త నన్ను పట్టించుకోని నాకు పెన్షన్ వచ్చేలా చూడాలంటూ నటి పాకీజా వేడుకున్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news