వాహనదారులకు అలర్ట్… తక్కువ టోల్ ఫీ ఉండే రూట్స్ తెలిపేలా రాజ్ మార్గ్ యాత్ర యాప్ లో త్వరలోనే కొత్త ఫీచర్ రాబోతోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దీనిపై కసరత్తు చేస్తోంది.

గమ్యస్థానానికి 2, 3 మార్గాలు ఉంటే ఏ ఏ రోడ్లలో ఎంత టోల్ ఛార్జీలు పడుతుందో కంపేర్ చేసుకోవచ్చు. చార్జీలలో పారదర్శకత పెంచేందుకు దీనిని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఈ యాప్ లో రోడ్ కండిషన్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇతర సదుపాయాలు తెలుసుకునేలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.